రైతుల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం, ఎన్నాళ్ళింకా ఈ నిరంకుశ ధోరణి

చంద్రగిరి నియోజకవర్గం, పనబాకం రైతుల ఆవేదనను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండటం చాలా బాధాకరం, వారికి ఇవ్వాల్సిన కనీస నష్టపరిహారం ఇవ్వకుండా వారిని బాధిస్తూ, చోద్యం చూస్తున్న ప్రభుత్వం. ఆదివారం కె.ఎన్.ఆర్ గ్రూప్ ప్రతినిధులతో మాట్లాడి వారికి న్యాయం చేకూరేవరకు పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని, జనసేన నాయకులు ప్రజలపక్షాన కోరగా దానికి వారు సానుకూలంగా స్పందించడం హర్షణీయం అని అలానే, స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై త్వరతిగతిన స్పందించి వారికి న్యాయం చేకూరేలా చెయ్యాలని లేని పక్షాన పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి దేవర మనోహర, వీరమహిళ శ్రీమతి ఆశా మరియు జనసేన సాయి తదితరులు పాల్గొన్నారు.