దుబాయ్ లో మోసపోయిన నిరుద్యోగ బాధితులను కలసిన జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్

*ప్రజలకు అండగా నిలిచే వాడే అసలైన నాయకుడు
*ప్రజాస్వామ్యలను తీర్చే వాడే నిజమైన నాయకుడు

దుబాయ్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 15మంది బాధితులను, బొలిశెట్టి శ్రీనివాసు కలిసి వారికి ధైర్యం, భరోసా కల్పించారు. వారిని అన్ని విధాల ఆదు కుంటామని, సమస్య పరిష్కారం జరగకపోతే, అవసరం అయితే తనే స్వయంగా విమానం టికెట్స్ తీసి తనతో పాటు ఇండియా తీసుకుని వెళతాను అని వారికి భరోసా ఇచ్చారు. కొన్ని ఖర్చుల నిమిత్తం వారికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సంద్భంగా గత పది రోజులు గా వారికి ఆశ్రయం ఇచ్చి, అన్ని రకాలుగా అండగా నిలిచిన కేసరి త్రిమూర్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసారు. అంతే కాకుండ గల్ఫ్ నుంచి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరు న ధన్యవాదములు తెలియచేశారు.