సాతంబాకం బ్రిడ్జిపై ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చాలి!
గంగాధర నెల్లూరు నియోజకవర్గం: పెనుమూరు మండల కేంద్రం నుండి చిత్తూరుకి వెళ్లే రహదారిలో, సాతంబాకం వద్ద చెరువుకి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జి, పెద్ద రంధ్రం ఏర్పడి ప్రమాదకర పరిస్థితిలో ఉండి రహదారిలో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యపై రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించాలని జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న తెలుపుతూ ఉపముఖ్యమంత్రి ఇలాకాలో పడిన రంధ్రాన్ని పూడ్చేదెవరు?.. ఈ సమస్యను సరి చేసేది ఎవరు? అని ప్రశ్నిస్తూ ఒక వారంలో సమస్యను పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం చూపించగలమని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-4.15.13-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-4.15.14-PM-1024x458.jpeg)