రామగుండం గడ్డ మీద ఎగిరిన జనసేన జెండా.. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామగుండం: జనసేన పార్టీ రామగుండం కోర్డినేటర్‌ మూల హరీష్ గౌడ్, నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ 10 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తా లోజిల్లా నాయకులు మంథని శ్రవణ్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంథని శ్రవణ్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసైనికులు అందరు పార్టీ గెలుపు కోసం కష్టపడాలి అని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యల మీద జనసేన పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గోపి కృష్ణ,నవీన్, రంజిత్, తిరుపతి, రాజశేఖర్, కుమార్, రాకేష్, సంతోష్, మున్నా, అజయ్, అనిల్, నిరాజ్ తదితరులు పాల్గొన్నారు.