దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన వినతి

కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం వీరనాగపురం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి చేసినందున ఇదివరకే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, రామకుప్పం పోలీసు అధికారులను కలిసి ఈ దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల అధ్యక్షులు హరీశ్, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, నవీన్, మండల కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, నవీన్ షహీన్షా మరియు జనసైనికులు పాల్గొనడం జరిగినది.