జ‌న‌సేన పార్టీకి అన్న‌దాసు లాంటి నాయ‌కులు అవ‌స‌రం

*పార్టీ ఆవిర్భావం నుంచి నిరంత‌ర కృషి
*49 నెల‌ల నుంచి పార్టీకి నిర్విరామంగా ఫండ్ అంద‌చేత‌
*2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను సీఎంగా చేసేందుకు అడుగులు

గుంటూరు: జ‌న‌సేన పార్టీ అభివృద్ధికి, పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డంలో ఆ పార్టీ నాయ‌కుడు అన్న‌దాసు వెంక‌ట సుబ్బారావు చేసిన కృషి వెల‌క‌ట్టలేనిద‌ని.. ఆయ‌న లాంటి నాయ‌కులు పార్టీకి చాలా అవ‌స‌రం ఉంద‌ని జ‌న‌సేన పార్టీ జిల్లా అధికార ప్ర‌తినిధి ఆళ్ళ హ‌రి అన్నారు. స్థానిక పండ‌రీపురం 5వ లైనులో గ‌ల జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల కార్యాల‌యంలో తెలుగు రాష్ట్రాలలో 1002 సభ్యత్వాలు చేసి రెండవ స్థానంలో నిలిచిన అన్న‌దాసును జ‌న‌సేన పార్టీ శ్రేణులు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా హ‌రి మాట్లాడుతూ.. పార్టీకి సభత్వం ఎంత ఉపయోగమో అందరికి తెలిసిందేన‌ని, తెలుగు రాష్ట్రాలలో 1002 సభ్యత్వాలు చేసి రెండవ స్థానంలో నిల‌వ‌డ‌మంటే సాధార‌ణ విష‌యం కాద‌ని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తనవంతు సహకారం అందిస్తూ.. ప్రతి కార్యక్రమం విజ‌య‌వంతం అయ్యేలా కృషి చేస్తూ పార్టీ ఎదుగుదలకు నిరంత‌రం అడుగులు వేస్తూ.. 49 నెల‌ల నుంచి పార్టీకి నిర్విరామంగా ఫండ్ అంద‌జేస్తూ.. 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను సీఎంగా చేసే దిశగా అడుగులు వేస్తూ.. పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు అబినందనలు తెలియజేశారు.