భార్యాభర్తలను ఒక్కటి చేసిన జనసైనికులు

శతఘ్నిన్యూస్ కథనానికి స్పందన

పాడేరు కోట్లగరువు ప్రాంతానికి చెందినటువంటి జనసేన పార్టీ వీరమహిళకు భారతికి అన్యాయం చేసిన సన్యాసపాలెం దిలీప్అనే వ్యక్తితో మాట్లాడి పెద్దల సమక్షంలో అక్రమసంబంధం వల్ల జరిగే పరిణామాలను వివరించి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇప్పించి ఇద్దరినీ ఒక్కటి చేయటం జరిగింది. వీరమహిళకు న్యాయం జరిగే విధంగా దిలీప్ కి సంబందించిన ఆస్తిని పిల్లలకు రాసే విధంగా మరియు భార్యకు ఎటువంటి హానీ తలపెట్టనని పెద్దల సమక్షంలో హామీ పత్రం దిలీప్ చే రాయించటం జరిగింది. భార్యభర్తలను ఒక్కటి చేసి, పిల్లల్ని తండ్రి చెంతకు చేరే విధంగా కృషి చేసిన జనసైనికులు పాడేరు జనసేనపార్టీ మండల ప్రెసిడెంట్ నందోలి మురళీకృష్ణ, కాకినాడ రూరల్ కి జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కి వీరమహిళ భారతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.