వరదబాధితులకి జనసేన నిత్యావసర సరుకులు పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరదబాధితుల సహాయార్థం జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా నాయకులు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో, శ్రీ దేవర మనోహర నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో రాయలచేరువు ఎగువ ప్రాంతాలలో 90 శాతం మునిగిన సి.కె పల్లి పంచాయతీలోని సూరావారిపల్లి, రెడ్డివారిపల్లి గ్రామాల వరద బాధితుల సహాయార్థం 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అలానే నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెల్లుతామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్య్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు, జిల్లా కార్యదర్శులు కలప రవి, హేమ కుమార్, కీర్తన మరియు దండు లక్ష్మీపతి రాయల్, పగడాల యువరాజ్, జస్వంత్,ముండ్లపాటి మురళి, కిరణ్, రవిప్రకాష్, రెడప్ప, సంజీవి హరి పాల్గొన్నారు.