థియేటర్లలోనే ‘మాస్టర్’ విడుదల.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘మాస్టర్‌’. లోకేష్‌ కనకారాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం త్వరలోనే ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్‌ అవుతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. గత కొన్ని నెలలుగా ఇలాంటి వార్తలు చాలా సార్లు వచ్చాయి. ఇలాంటివి వచ్చిన ప్రతిసారీ చిత్ర బృందం ఖండిస్తూనే వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌పై పలు కథనాలు మీడియాలో వచ్చాయి. దీంతో మరోమారు చిత్ర యూనిట్‌ దీనిపై స్పందిస్తూ మరోసారి చిత్రం విడుదల పై క్లారిటీ ఇచ్చింది. థియేటర్స్‌ ఎప్పుడు ఓపెన్‌ అయితే అప్పుడు, ఇంకా టైమ్ పట్టినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల కోరిక మేరకుమరియు విజయ్ అభిమానుల కోరిక మేరకు థియేటర్లలోనే విడుదల చేస్తాం. ఓటీటీల్లో విడుదల అంటూ వస్తున్న రూమర్స్‌ని ఎవ్వరూ పట్టించుకోవద్దు అంటూ చిత్ర యూనిట్ వెల్లడిస్తూ ట్వీట్‌ పెట్టింది. ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవికా మోహన్‌ కథానాయికగా నటించింది.