శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేడు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.
వైద్య సేవలు మినహా ఇతర ఏ షాపులు తెరవొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మార్గాలు, జంక్షన్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు.