మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ స్థానిక చౌదరి పేట రోడ్లో అనారోగ్యంతో వృద్ధురాలు చనిపోవడంతో ఆ వార్డు ప్రజలు గుడివాడ పట్టణ ఆర్.కె వారియర్స్ కు తెలియజేయడంతో ఆ వృద్ధ తల్లికి అన్ని తామై అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు భాగంగా గుడివాడ చౌదరి పేట వార్డులో ఉంటున్న కట్ట జయమ్మ అనారోగ్యంతో చనిపోవడంతో ఆ వార్డ్ ప్రజలు ఆ సమాచారాన్ని మాకు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ వృద్ధతల్లికి అన్నీ మేమే అంతక్రియలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నామని తెలియజేశారు. అదేవిధంగా దైవం మనుష్య స్వరూపమని దేవుడు ఎక్కడో లేడని మనుషుల్లోనే ఉంటారని మనము ఎంత పవిత్రంగా జన్మనిస్తామో అదే పవిత్రంగా చివరి దశలో కూడా వెళ్లాలని మా ఆకాంక్షాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, మట్ట జగదీష్, కిరణ్, శివ, చరణ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.