మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ జనసైనికులు

  • కన్నతల్లిని రోడ్డు మీద వదిలి వేసిన బిడ్డలు

గుడివాడ నియోజకవర్గం: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక క్లబ్ రోడ్ లో ఒక గుర్తుతెలియని తల్లి తీవ్ర అనారోగ్యంతో రోడ్డున అస్తవ్యస్తంగా పడిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు చేసి ఆ తల్లిని కాపాడి గుడివాడ పట్టణ జనసైనికులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ.. నవమాసాలు మోసి మనకి పవిత్రమైన జన్మనిచ్చిన తల్లికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దౌర్భాగ్యం అని, దయచేసి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకు ఇబ్బందిగా ఉంటే మాకు తెలియజేస్తే వారిని ఆశ్రమంలో చేర్పించి, కడవరకూ తోడుగా ఉంటామని తెలియజేశారు. ఈ తల్లి పేరు సామెత లక్ష్మి మన గుడివాడ పట్టణ క్లబ్ సమీపంలో రోడ్డు పక్కన ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియజేయగా ఆ తల్లిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేర్పించ్డం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు. దయచేసి ఈ తల్లిని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే ఆర్కే వారియర్స్ కు మరియు పోలీసు వరకు ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాము అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం నాయకుల నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, పందిళ్ళ శీను, గంట అంజి, మరియు జనసైనికులు పాల్గొన్నారు.