దాచేపల్లి జనసేన కార్యాలయంపై పోలీసుల ముట్టడి అప్రజాస్వామ్యం

గురజాల: దాచేపల్లి జనసేన పార్టీ కార్యాలయం పై పోలీసులు ముట్టడించడం అప్రజాస్వామ్యం అని జనసేన నేతలు మండిపడ్డారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గ జనసేన నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ యువశక్తి ప్రోగ్రాం గురించి చర్చించుకుంటున్న జనసేన నేతలను పోలీసులు కార్యాలయంలోపలికి వచ్చి ముట్ట డించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు జనసేన నేతలు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇంకొక్కసారి పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని మాట్లాడితే వైసీపీ నేతల అంతు చూస్తామని హెచ్చరించారు. కుప్పంలో జరిగిన సంఘటనపై చంద్రబాబు ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తే ప్యాకేజీ అని మాట్లాడుతున్నారు. ఆ ప్యాకేజీకి నువ్వు బ్రోకరేజ్ చేసావా అంబటి రాంబాబు అని విమర్శించారు. సత్తెనపల్లిలో సెప్టిక్ ట్యాంకు ఘటణలో చనిపోయిన మృతుని కుటుంబం దగ్గర కమీషన్ అడిగిన నువ్వు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి కాదు అని అన్నారు.