ప్రజా నాయకుడు మన పవనుడు

జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే విధానం, సమస్యల పట్ల స్పందిస్తున్న పద్ధతి ఆంధ్రరాష్ట్ర ప్రజలను మంత్రముగ్ధులను చేసింది.

ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవ భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇలాంటి నాయకుడికి అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు మార్చుతారని ప్రజలు దృఢవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

గెలిచే వరకు ముద్దులు పెట్టి గెలిచినాక పన్నులతో గుద్దే నాయకుడు ఇక మనకొద్దు అని ప్రజలు అనుకుంటున్నారు.
ఒక వ్యక్తిలో ఉండే నిజాయితీ, నిస్వార్థం, నిబద్ధత, సమాజ సేవ పట్ల అంకిత భావం వల్ల కోట్లాదిమంది వ్యక్తులు ఆ వ్యక్తిని ఆరాధిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహోన్నత మానవతామూర్తి పవన్ కళ్యాణ్. అందుకే కోట్లాదిమంది అతన్ని అంతగా ఆరాధిస్తారు. రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడం ఖాయం. జనసేన విజయకేతనం తథ్యమని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.