ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

  • స్విమ్మర్స్ తో జనసేన నాయకుల వంట, వార్పు

మదనపల్లి: మదనపల్లి మండలంలో ఎలకపల్లి కుంట దగ్గర చెక్ డ్యామ్ స్విమ్మర్స్ తో రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి సమక్షంలో స్వయంగా వంట వార్పు చేసి జనసేన నాయకులు, కార్యకర్తలు, స్విమ్మర్స్ తో కలసి భోజనం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయిందని, సర్వ నాశనం అయిపోయిందని, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, రైతంగానికి గిట్టుబాటు ధర లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండరు విడుదల అన్నాడు అది లేదు సమస్త ప్రజలు అంత విసిగిపోయారని అన్నారు. మన మదనపల్లికి అన్ని అర్హతలు ఉండి కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా ఉందని ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే వైసీపీ టికెట్ అని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం ప్రజలతోనే మమేకం అయి పోరాటాలు చేస్తా ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జెండా పట్టి ఉండరు, ఏ రోజు కార్యకర్తలని ఆదుకొని ఉండరు అలాంటి వారి దగ్గర కోట్లు కోట్లు డబ్బులు తీసుకోవడం ఆస్తులు రాపించుకోవడం వారికీ టికెట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కావునరాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకోసం ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యం బద్ధంగా ఓటు అనే ఆయుధంతో ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పి గద్దె దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, ఐటీ విభాగ నాయకులు లక్ష్మినారాయణ, గిరి, రాజా రెడ్డి, రూరల్ ప్రధాన కార్యదర్శి జనార్దన్, పట్టణ ఉపాధ్యక్షులు నగేష్, నరేష్, గణేష్, సుదర్శన్, లక్ష్మిపతి తదితురులు పాల్గొన్నారు.