సెక్షన్ 30 గురించి భయపడవలసిన పనిలేదు: పంతం నానాజీ
- 13వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారు
- 14వ తేదిన ఉదయం అన్నవరం స్వామి దర్శనం అనంతరం..
- సాయంత్రం 5గంటలకు కత్తిపూడిలో బహిరంగ సభ
- 15వ తేదిన.. పిఠాపురంలో ఉదయం 9 గంటలకు విజ్ఞానులు, వైద్యలతో సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం
- 16వ తేదిన పిఠాపురంలో ఉన్న ప్రజ సమస్యలు పైన చర్చ
- 16వ తేది ఉప్పాడలో బహిరంగ సమావేశం
- 17, 18వ తేదీలు కాకినాడ రూరల్, సిటీ
కాకినాడ రూరల్ నందు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన వారాహి యాత్ర వివరాలను మీడియాకు తెలియజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తున్నాడంటే వైసిపి నాయకులకు భయం. మీరు చెప్పినట్లు పేకేజీ తీసుకుని చంద్రబాబు చంక ఎక్కేస్తే పవన్ కళ్యాణ్ అంటే మీరెందుకు భయపడుతున్నారు. సెక్షన్ 30 గురించి కార్యకర్తలు భయపడవలసిన పనిలేదు. మనకు పోలీసు శాఖ నుండి అన్ని అనుమతులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగనన్నలే అవుట్ల పేరుతో వైసిపి అతిపెద్ద భూమి స్కాంకు పాల్పడింది. ఓట్లు వేసిన గెలిపించినా ప్రజలు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని.. రాళ్ళతో కొట్టె పరిస్థితి ఏర్పడిందని, విద్యుత్ చార్జీలపై త్వరలో ఉద్యమం చేపడతాం తెలిపారు.