జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, ఉప్పరాపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు శెనంశెట్టి గణేష్ స్వామి ఇటీవల మరణించడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ మరియు సురక్ష హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపడంతో పాటూ వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేయడంతో పాటూ ఎల్లవేలలా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మరియు మండల జనసైనికులు పాల్గొన్నారు.