తొండంగి మండల స్థాయి జనసేన సమావేశం
తొండంగి మండలం, మత్స్యకార గ్రామమైన గొర్సపాలెంలో జనసేన మండల అధ్యక్షులు నాయుడు పర్యటించారు. ఇటీవల పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని మరియు గ్రామ కమిటీ నిర్మాణం పై సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి గోర్షపాలెం జనసైనికులు యాదల శ్రీను, యనమల గోపికృష్ణ, బద్ది సతీష్, వోకదారి పేట కార్తీక్ మండల ఉపాధ్యక్షుడు కండవల్లి గణేష్ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి రాంప్రసాద్, అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి దుర్గాప్రసాద్ తొండంగి గ్రామ అధ్యక్షుడు వెలుగుబంటి నాగు తొండంగి సీనియర్ జనసేన నాయకుడు పెద్దిరెడ్డి వెంకటేష్ యూత్ ప్రెసిడెంట్ బద్ది శివ తొండంగి మండలం చిరంజీవి యువత అధ్యక్షులు వేమవరం రాంప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-18-at-9.44.18-PM-1024x614.jpeg)