జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు తాళ్ళూరి రామ్ నేతృత్వంలో ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకుల రవీందర్ రెడ్డి, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కమిటీల నియామకం, మార్చ్ 14న జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల గురించి పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది.