రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

కోనసీమ జిల్లా, కొత్తపేట, రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. వీరంతా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందినవారు. కొత్తపేట మండలం ఏనుగుల మహల్ సమీపంలో గురువారం 1:00 సమయంలో కొత్తపేట బంధువుల ఇంటివద్ద నుండి కొమరాజులంక తిరిగి వెళుతుండగా రావులపాలెం వైపునుండి కొత్తపేట వస్తున్న పాలవ్యాన్ పల్సర్ బైక్ ను ఢీకొట్టడంతో కొమరాజులంక గ్రామానికి చెందినఅప్పన మహేష్ (20), అప్పన వెంకటలక్ష్మి (40),అప్పన సత్యవతి (55) అక్కడికక్కడే మృతి. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న కొత్తపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాసరావు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పోలీసులు మరియు ఆసుపత్రి డాక్టర్లతో అధికారులతో మాట్లాడడం జరిగింది.