జనసేన వారాహి యాత్ర విజయవంతం కావాలని జనసేన నాయకుల తిరుమల పాదయాత్ర

సర్వేపల్లి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జనసేన వారాహి యాత్ర విజయవంతం కావాలని మొక్కును కోరుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి, మండల నాయకులు పోలూరు పెంచల నరసింహా, తాండ్ర శ్రీను అలిపిరి నుండి కాలి నడకన ప్రయాణం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనుబోలు గణపతి మాట్లాడుతూ త్వరలో వారాహి వాహనంలో చేపట్టబోయే జనసేన పార్టీ ఎన్నికల యాత్ర విజయవంతం కావాలని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆ ఏడుకొండల వేంకటేశ్వరుని ఆశీస్సులు కోసం ఈ ప్రయాణమని మనుబోలు గణపతి తెలిపారు.