ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు జనసేన సన్మానం

పాలకొండ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా మన్యం జిల్లా బొడ్లపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుత స్కూల్ విద్యార్థుల సమక్షంలో మరియు పూర్వ విద్యార్థులు అయినటువంటి గ్రామ యువత అందరి సమక్షంలో స్కూల్ ఉపాధ్యాయులు అయినటువంటి హెచ్ఎం వారాడ రాంబాబు మాస్టర్ మరియు బోనంగి వాసుదేవరావు మాస్టర్లకు బొడ్లపాడు యువత సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జానీ మాట్లాడుతూ యువత ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది తల్లిదండ్రులైతే, ప్రపంచాన్ని మనకి పరిచయం చేసేది గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంతో సమానమని ఆలాంటి గురువులు అయినటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకి గ్రామ యువత ఇలా సన్మానం చెయ్యడం చాలా గర్వకారణమని అలాగే ఈ టీచర్స్ వచ్చిన తరువాత బొడ్లపాడు విద్యార్థుల చదువు క్రమశిక్షణ చాలా మెరుగుపడ్డాయి అని చెప్పడం జరిగింది. ఇలాంటి ఉపాధ్యాయులు మా గ్రామంలో ఎక్కువ కాలం పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.