తిరుపతి పట్టణ కమిటీ కార్యవర్గ సమావేశం

తిరుపతి, మంగళవారం తిరుపతి పట్టణ నూతన కమిటీ కార్యవర్గం సమావేశం రాజా రెడ్డి అధ్యక్షతన ఎంతో ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ – తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ మరియు రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొని జనసేన పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సమావేశంలో.. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ గ్రాండ్ నుంచి బలోపేతం చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ గా ఉండాలని అన్నారు.

కిరణ్ రాయల్ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు అందరూ ఇప్పటి నుంచే రేపు రాబోయే ఎలక్షన్ ని ఎదుర్కొనే లా సమ్సిద్ధమై ఉండాలని ఎట్టి పరిస్థితిలో రేపు పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకునే విధంగా మనమందరం పార్టీ కోసం కలిసి కృషి చేయాలని అన్నారు..

అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి మాట్లాడుతూ నూతన సభ్యులందరూ ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరు కావాలి అని రేపు రాబోవు రోజుల్లో వార్డ్ కమిటీలను కూడా వేసి తిరుపతి పట్టణ జనసేన పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకు వెళ్లబోతున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముక్కు సత్యవంతుడు, బాబ్జి, హేమ కుమార్, మమత, సుభాషిణి, వనజ, సుమన్ బాబు, పార్థు, అమృత మునస్వామి, కీర్తన, కోకిల మరియు వీరమహిళలు, జనసైనికులు, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.