వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి పొందాలంటే యువత ముందుకు రావాలి: చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

  • యువత అభివృద్ధి కోసం జనసేన పార్టీ కృషి
  • జనసేన యువశక్తి కార్యక్రమానికి యువత పాల్గొనాలి
  • సమాజాన్ని మార్చాగల సత్తా యువతకు ఉంది
  • జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు, వైసిపి రాష్ట్ర పాలన నుంచి విముక్తి పొందాలంటే యువత ముందుకు రావాలని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. యువత, పవన్ కళ్యాణ్ కలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమం పోస్టర్ను చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న మన యువత మన భవిత కార్యక్రమములో తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. మన రాష్ట్రంలో యువకులు అధికంగా ఉన్నారని వారు తలుచుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా వారికి ఉందని తెలిపారు. నేటి యువత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నారని తెలిపారు. ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా యువకులు ముందుండి పోరాడి సమాజ మార్పు కోసం కోరుకుంటారని తెలిపారు. ఎన్నికల ముందు జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న జగన్ మోహన్ రెడ్డి యూవతకు అన్యాయం చేశారని మన్డిపడ్డారు. నేడు తల్లిదండ్రుల విద్యార్థులను కాలేజీలకు పంపించాలంటే భయపడుతున్నారని రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, విచ్చలవిడిగా అమ్మడంతో యువత వాటికి బానిసవుతున్నారని దీంతో తల్లిదండ్రులు కూడా భయాందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలన్న జనసేన పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యువత వారి తల్లిదండ్రులు, పెద్ద ఎత్తున పాల్గొని యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మను క్రాంత్ రెడ్డి తెలిపారు.

నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ… యువత మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక భరోసా ఇచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు అన్ని డివిజన్లోని యువత యువశక్తి కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రణస్థలంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో ప్రోత్సహించే విధంగా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.. నెల్లూరు నగరం నుంచి వేలాదిగా యువత. పవన్ కళ్యాణ్ అభిమానులు. జనసేన పార్టీ నేతలు భారీగా పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు.

జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… యువతను అనగదొక్కేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జనసేన పార్టీ నేత కొట్టే వెంకటేశ్వర్లు మండిపడ్డారు.. ఈనెల 12న శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు యువత భారీ ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.. యువత అభివృద్ధి పథంలో నడవాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నేటి యువత యువశక్తి కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి. నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, కృష్ణ – పెన్నా కమిటీ రీజినల్ కో- ఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, జిల్లా అధికార ప్రతినిధులు కారంపూడి కృష్ణారెడ్డి, కలువాయి సుధీర్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, జనసేన మహిళా నేతలు శ్రీగౌరీ, ఉమాదేవి, వరలక్ష్మి, సావిత్రి, నగర నేతలు, శ్రీధర్, సుల్తాన్, కరీమ్, ఉదయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.