అగ్ని ప్రమాద బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

అనపర్తి, పెదపూడి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న కుటుంబాలను జనసేన పార్టీ శ్రేణులు పరామర్శించి వారికి రెండు బస్తాల బియ్యం కూరగాయలు, నగదు మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి జనసేన పార్టీ సమన్వయ కర్త రావడ నాగు పెదపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, మండల నాయకులు సుంకర బుజ్జి, వడ్లమూరి గోవిందరాజు, కర్రి శ్రీను, పెదపూడి గ్రామ కన్వీనర్ అమరాది రవి, ఉపాధ్యక్షులు సతీష్, సింహాచలం, రాపర్తి సాంబశివ మరియు పెదపూడి, బిక్కవోలు అధ్యక్షులు తోట పండు మండల జనసైనికులు కొండా బాబు, గోవిందు, బిట్టు, శివ, కర్రి శ్రీను పాల్గొన్నారు.