దేశ వ్యాప్తంగా హైకోర్టు జడ్జీల బదిలీలు

దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జిల బదీలీ జరిగింది. మొత్తం 15 మంది జడ్జీలను బదిలీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 మందిని బదిలీ చేయాల్సి ఉండగా అందులో ఇద్దరిని మినహాయించి మిగతా 15 మందిని బదిలీ చేసింది. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్‌ రవినాథ్‌ తిలహరి, ఆషానుద్దీన్‌ అమానుల్లా నియమితులు కాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భయాన్‌ నియమితలయ్యారు.