బత్తుల దంపతులకు సన్మానం

రాజానగరం నియోజకవర్గం, కానవరం గ్రామం, జనసేన శ్రేణుల కోరిక మేరకు, ఆ గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి లకు జనసేన కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం క్రైస్తవ సోదరుల కోరిక మేరకు చర్చిలో జరిగిన కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ సమాజానికి చేస్తున్న సేవలు చర్చి పాస్టర్లు సత్కరించారు. అనంతరం బలరామకృష్ణ మాట్లాడుతూ ఏసుప్రభు చూపించిన మార్గాన్ని ప్రేమను ప్రతి ఒక్కరూ అనుసరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందని దైవజనులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రార్థన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంట శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, ఇతర నాయకులు కానవరం జనసైనికులు పాల్గొన్నారు.