డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘననివాళి

ఉరవకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని, ఆశయాలను గౌరవించి వాటిలోని అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వారి ఆశయాలను, సిద్ధాంతాలను పాటించాలి అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు అద్యక్షులు కేశవ అచనాల, కుడెరు మండల అధ్యక్షలు నగేశ్, నాయకులు రమేష్, హరి శంకర్, మని కుమార్, ప్రియతమ, ఓబులేసు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.