తుని జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళి

తుని: భారత రాజ్యాంగ రూప శిల్పి, ఉన్నత విద్యావంతుడు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు, భారత రత్న శ్రీ బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం తుని నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.