మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

కాకినాడ సిటీ: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 21 డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గాంధీ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం చిన్న పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మనకి ఇప్పుడు మనమందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం అంటే ఎందరో మహానుభావులు చేసిన కృషి అని ఆ మహానుభావులు ఒక మహానుభావుడు జాతిపిత గాంధీజీ అని గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం అనే ఎన్నో కార్యక్రమాలు చేసి మనకి స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారని గాంధీజీ కలలకున్న స్వరాజ్యం త్వరగా రావాలని కోరుకుంటూ వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారు 9వ డివిజన్ నాయకులు సత్యనారాయణ, వీరమహిళలు హేమావతి, 21 డివిజన్ ఉపాధ్యక్షులు విల్లా సత్తిరాజు, మరియు జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొని జయప్రదం చేశారు.