ఆగురు మణి ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళులు

పార్వతిపురం: జనసేన పార్టీ పార్వతిపురం మండల అధ్యక్షురాలు ఆగురు మణి ఆధ్వర్యంలో పార్వతీపురం మండల నాయకుల ఆధ్వర్యంలో కృష్ణ పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ రచయిత, బడుగువర్గాలలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించి బహుముఖ వికాసానికి బాటలు వేసిన నవభారత నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి, సంక్షేమాలకు మన కృషిని మరింత దీక్షతో కొనసాగిద్దాం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి ఆశ‌యాల‌ను సాధించ‌డ‌మే ఆయ‌న‌కు మనం ఇచ్చే నిజ‌మైన నివాళిగా పేర్కొన్నారు. డా.బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషి వల్లే దేశానికి గొప్ప రాజ్యాంగం సమకూరిందన్నారు. అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజాన బాలు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, తేజ, పవన్, జనసేన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.