నిరుపేద చిన్నారులకు ఆహార పొట్లాలు అందించిన బాల్యం రాజేష్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నుంచి స్ఫూర్తిగా సమాజానికి మన వంతు బాధ్యతగా ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ నిరుపేద చిన్నారులకు ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్యం రాజేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకు వచ్చి సమాజానికి మన వంతు బాధ్యతగా ఎంతోకొంత సహాయపడాలని జన్మదినం సందర్భంగా ఇలాంటి కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదని దేవుని కోరుకుంటున్నానని.. అలాగే నా జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు జనసైనికులు వందల మంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతమంది ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి.. ఆఖరి శ్వాస వరకూ.. జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.