జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళులు

దర్శి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 66వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు, భారతదేశానికి అంబేడ్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పడమర గంగవరం వార్డు సభ్యులు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాశి కొండయ్య, ఐటీ కోఆర్డినేటర్‌ ఉల్లి బ్రహ్మయ్య, జనసైనికులు మండల కమిటీ నాయకులు పుప్పాల పాపారావు, ఎస్.కె భాష, ఏ అంకిరెడ్డి, ఎస్‌కే వెంకటేష్, ఉల్లి వెంకటేష్, ఆవుల కొండ, తిరుమల వెంకటేశ్వర్లు, పుప్పాల శ్రీకాంత్, కురంగి శ్రీను, చొప్పరపు తేజ తదితరులు పాల్గొన్నారు.