జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఏసీ మెంబర్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డా.హరి ప్రసాద్ మాట్లాడుతూ మండల కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండ గట్టాలని, ప్రజలకు పథకాల పేరుతో ఆశ చూపి నిలువునా ముంచుతున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, మంచితనాన్ని, ప్రజల పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని చెప్పాలన్నారు. ప్రతి గడప గడపకు జనసేన పార్టీ విధి విధానాలు చేరేలా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.