“పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన” టీం ఆధ్వర్యంలో భగత్ సింగ్ కి నివాళులు

చోడవరం, త్యాగ ధీరుడు, వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్బంగా “పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన” టీం ఆధ్వర్యంలో మహానుభావుడికి నివాళులు అర్పించి చోడవరం నియోజకవర్గంలోని యమున అనే ఆడబిడ్డకు కుట్టు మెషిన్ అందచేయడం జరిగింది. ఆహ్వానం మేరకు అతిధిలుగా వచ్చిన చోడవరం జనసేన నాయకులు పి.వి.ఎస్.ఎన్ రాజు మరియు రాష్ట్ర జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ డా. బొడ్డేపల్లి రఘు మరియు వీర మహిళలు రామలక్ష్మి, షాలిని జనసైనికులు కల్యాన్ నాయుడు, భరత్ ఉగ్గిన, నడుపురి లక్ష్మణ్, లుక్స్ గణేష్, శశిధర్ రెడ్డి లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.