నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళులు

మంగళగిరి నియోజకవర్గం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ జనసేన పార్టీ తరఫున మా నివాళులు అర్పించడం జరిగిందని, ఆయనీ స్ఫూర్తితో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారని, నేడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అదేవిధంగా సైకో పాలన పోయి రాబోయే ఎన్నికల్లో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు.