రాజంపేట జనసేన ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలుకు ఘన నివాళులు

అన్నమయ్యజిల్లా, రాజంపేట అసంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం, టి. సుండుపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో శ్రీకృష్ణ దేవరాయలు జయంతి సందర్భంగా.. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య వీరులు, అఖండ భారత చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు వారి హయంలో మన రాయలసీమ అభివృద్ధి పరంగా రతనాలసీమ చేసినటువంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా ప్రస్తుతం సమాజంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఎం దామోదర్ నాయుడు, పూజారి వెంకటయ్య, మాజీ ఆర్మీ నంద్యాల కృష్ణయ్య, గ్రామ అధ్యక్షులు చెన్నశెట్టి సుబ్బరాము, దళితనాయకులు వీరణాగయ్య, మైనార్టీ నాయకులు ఛాన్ భాష, కృష్ణా నాయక్, చంద్రప్పనాయుడు, జనసేన, తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు, జనసైనికులు, స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు, మండల వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.