ఉత్తరాంధ్రలో జనసేన సంస్థాగత నిర్మాణానికి త్రిసభ్య కమిటీ

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో జనసేనను బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారు. ముందుగా పార్టీలో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ తరువాత విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీలోని ముగ్గురు సీనియర్ నాయకులతో ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హన్ ఖాన్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్ సభ్యులుగా ఉంటారు. తొలుత జిల్లా కమిటీలు, ఆ తరువాత మండల, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తయ్యే విధంగా ఈ కమిటీ చర్యలు చేపడుతుంది. పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు ఈ త్రిసభ్య కమిటీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది.