టీఎస్ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ – 2020 ఫలితాలను మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఐసెట్ కన్వినర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వెల్లడించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని కామర్స్ ప్రాంగణంలో ఫలితాలు విడుదల చేశారు.

తెలంగాణ ఐసెట్‌ – 2020 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి సోమవారం వరంగల్‌లో విడుదల చేశారు. కొవిడ్‌19 నేపథ్యంలో రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశామని, అనేక సమస్యలతోనే మూడోసారి ఐసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మహమ్మారి సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వ్యయ ప్రయాసాలకోర్చి నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ, కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు, ఐసెట్‌ బృందానికి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తరఫున అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఐసెట్‌లో ప్రవేశానికి 58,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 45, 975 మంది పరీక్షకు హాజరైతే 41,506 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పేర్కొన్నారు.

టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు కోసం అధికారిక వెబ్‌సైట్  https://icet.tsche.ac.in/TSICET/TSICET_GetRankCard2K.aspx