టీటీడీ స్వామివారి ఆదాయాన్ని ఆర్జించే వ్యాపార సంస్థగా మారుతోంది: అంజూరు చక్రధర్

చిత్తూరు, టీటీడీ కూడా రాను రాను స్వామివారి ఆదాయాన్ని ఆర్జించే వ్యాపార సంస్థగా మారి విపరీత ధోరణితో ప్రవర్తిస్తోంది. రాజకీయ బుజ్జగింపుల కోసం పదుల సంఖ్యలో బోర్డు మెంబర్లను నియమించుకుంటూ, విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా స్వామివారి క్యాలెండర్లను, డైరీలను అమెజాన్ లో పెట్టి ఎక్కువ ధరలకు అమ్ముతుంది. రాబోయే రోజుల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈ కామర్స్ సైట్లలో పెట్టి అమ్మినా ఆశ్చర్యపోనక్కరలేదు. టీటీడీ నిర్ణయం భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వెంటనే పునరాలోచించాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ అన్నారు.