వేరవరం గ్రామంలో 22వ రోజు “జనంకోసం – జనసేన”

జగ్గంపేటలో చేపట్టిన ‘జనం కోసం జనసేన’ కార్యక్రమం చేపట్టి నేడు 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగ్గంపేటనియోజ కవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట మండలం వేరవరం గ్రామంలో జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహణలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలుసుకున్నట్టు చెప్పారు. గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో చాలా సమస్యలను గుర్తించామని తెలిపారు.