తుంగతుర్తి నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గ కమిటీ తిరుమలగిరిలో వెంకటేష్ గౌడ్ మరియు అశోక్ నంద ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నల్గొండ పర్యటన గురించి అలాగే నియోజవర్గంలో పార్టీ బలోపేతంపై మరియు నియోజకవర్గంలోని సమస్యలపై పోరాడే దిశగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరని గౌతమ్, ఏంగోజు శివ, శివ, వినయ్, విష్ణు, సాయి, శ్రీను, అరుణ్, అరవింద్, యాకస్వామి, రానదీర్, బద్రి, అరుణ్, వీర మహిళ సౌమ్య మరియు మండల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాలుగొనడం జరిగింది.