వై.సి.పి నాయకుల నిర్లక్ష్య వైఖరితో ఇద్దరు చిన్నారులు మృతి

  • చిన్నారుల మృతిని ఖండించిన జనసేన నాయకులు

పూతలపట్టు నియోజకవర్గం: యాధమరి మండలం, తెళ్లరాలపల్లి గ్రామంలో నాడు_నేడు పనుల కోసం పాటశాల ముందు తవ్విన గుంతలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు. పాటశాల ముందు నాడు నేడు పనులకోసం వై.సి.పి.నాయకులు తవ్వినగుంత గత ఒక సంవత్సరంగా ఇలానే ఉందని, ఈ విషయము మండల విద్యాశాఖ అధికారి, నిత్యం పాటశాలకు వచ్చే ఉపాద్యాయులు, కూడా చూస్తూ ఉండిపోయారు అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు బి.కుమార్ ఖండించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ, మరియు వై.సి.పి నాయకుల నిర్లక్ష్య వైఖరితో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని. దీనికి కారకులైన అధికారులు, వై.సిపి.నాయకులపై చర్యలు చేపట్టాలని, చిన్నారుల కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల జనసేన నాయకులు మృతిచెందిన చిన్నారులకు నివాళులు అర్పించారు. చిన్నారుల మృతిని ఖండించిన వారిలో మండల జనసేన ప్రధాన కార్యదర్శి వేముల పవన్, సంయుక్త కార్యదర్శి ఎస్.కార్తి, జనసైనికులు వెంకటేష్, ప్రభాకర్, దిల్లిబబు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.