ప్రభుత్వ పాలన పై సర్వత్రా నిరసన: జయరాం

*జనసేన ప్రజల్లో తీసుకుని వెళ్లేందుకు సరైన అవకాశం

నరసన్నపేట, రాష్ట్రంలో నేడు కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా సర్వత్రా నిరసన వ్యక్తమవుతోందని దీనిని జనసేన పార్టీ మళ్లించేందుకు గాను సరైన అవకాశం లభించిందని నరసన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి జయరాం తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలంలోని మడపం గ్రామంలో జనసేన కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారని వివరించారు. ఇదే విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసిన అవసరం నేడు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవలసిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు.