ఎచ్చెర్ల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదల పాలిటి కన్నీళ్లు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజవర్గం, రణస్థలం మండలంలో రణస్థలం పంచాయతీలో జేఆర్ పురం పంచాయతీలో జగనన్న ఇళ్ళు కేటాయించి మూడున్నర సంవత్సరాలు అవుతుంది. ఈ స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి జగనన్న ఇల్లు ఎటువంటి నిర్మాణం జరగలేదు ఈ జగన్ ప్రభుత్వం జనాలు మోసం చేసింది. జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ రణస్థలం మండలం నాయకులు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు దాన్నాన చిరంజీవి రెడ్డి, భాస్కరరావు, సువ్వాడ రామారావు, పిన్నింటి సురేష్, శ్రీను పంప్, ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.