జనసేన మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు వంట సామాగ్రి అందజేత

వైజాగ్ సౌత్: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ పాఠశాలలో వంట సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం నాయకులు, వాసవి క్లబ్
ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 201ఏ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ఈ
వంట సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 201ఏ అఫీషియల్ విజిట్లో భాగంగా క్లబ్బులు అన్నిటినీ పర్యటించడం జరుగుతుందని, అందులో భాగంగా వాసవి క్లబ్ వారు చేసే సేవలను పరిశీలించడం జరిగిందన్నారు.
సామాజిక బాధ్యతగా వాసవి క్లబ్ నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎంతోమందికి చేయూత అందిస్తుందని చెప్పారు. ఎన్నో పేద కుటుంబాలలో వెలుగును నింపిందన్నారు. వాసవి క్లబ్ మరియు జనసేన పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంతో వాసవి క్లబ్ మరియు జనసేన పార్టీ పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే పాఠశాలకు వంట సామాగ్రిని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్ పర్సన్ చెక్క బంగార్రాజు, రీజినల్ సెక్రటరీ కేసారపు నాగేశ్వరరావు, జోన్ చైర్ పర్సన్ సిల్వర్ స్టార్ వరధాకృష్ణ, కొలుకూరి రామకృష్ణ, గుర్రాల శ్రీను, భాచ్చు అప్పలరాజు, ఎస్ సతీష్ కుమార్, కేసారపు సుబ్బారావు, ఉడా రాజు, కోట్ల రాధ, శైలజ తదితరులు పాల్గొన్నారు.