పెనుకొండ జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ ఆదేశాల మేరకు జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా 2 రోజు జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అంటూ పెనుకొండ మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం పెనుకొండ మండల కేంద్రం శెట్టిపల్లి పంచాయతీలో గత మూడు సంవత్సరాలు కిందట 200 పైగా ఇళ్ల పట్టాలు కేటాయించిన స్థలంలో కనీసం ఎటువంటి సౌకర్యం లేదు ఒక్కరు కూడా ఇంటి పునాదులు కూడా వేయలేదు అడవి ప్రాంతంలో కొండ గుట్టల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ప్రజలు ఇల్లు ఎలా కట్టుకుంటారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఇల్లు పట్టాలు ఇచ్చిన స్థలంలో రోడ్లు, నీరు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు లేవు కానీ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 70 శాతం పూర్తి అయిపోయాయి అంటూ వారు మరియు అధికార పార్టీస్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎంపీ గోరంట్ల మాధవ్ మరియు అధికార పార్టీ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మీరు చేస్తున్న అరాచకాలను భూదోపిడీలను ప్రజా దృష్టికి తీసుకెళ్లి మీ ప్రభుత్వాన్ని కూల్చడం కాయం అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కుమార్, రాజేష్, మండల అధ్యక్షుడు మహేష్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాబా, మండల సీనియర్ నాయకులు బంగారం, హరి నాయక్, పట్న యూత్ నాయకులు మల్లేష్, పెనుకొండ పట్నం నాయకులు ప్రదీప్, మనోహర్, గంగాధర్, రాజు, శీన, రాజా తదితరులు పాల్గొన్నారు.