ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ఆధ్వర్యంలో సెక్రెటరీలకు సత్కారం

విశాఖ, ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్, యం.వి.పి.కాలనీలో శ్రీ గణేష్ జూనియర్ కాలేజి వేదికగా కార్పొరేటర్ గేదెల నాగరాజు, ప్రముఖ సైకాలజిస్ట్ డా.రామిశెట్టి జ్యోత్స్న, గణేష్ జూనియర్ కాలేజి ఛైర్మన్ బి.ఎల్.గణేష్ ప్రత్యేక అతిధులుగా యం.వి.పి.కాలనీ ప్రభుత్వ సచివాలయంలో విశిష్ట సేవలందించిన సెక్రెటరీలను సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గేదెల నాగరాజు మాట్లాడుతూ ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ స్ఫూర్తితో ఇతర సేవా సంస్థలు విశిష్ట సేవలందించిన వారిని ఈవిధంగా సత్కరిస్తే మరింత స్ఫూర్తిగా సేవలందిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ జూనియర్ కాలేజి ఛైర్మన్ గణేష్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభ గల విద్యార్థులకు మేము ఉచితంగా కోచింగ్ మరియు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ కొండేటి భాస్కర్, సంస్థ ప్రతినిధులు పోలిశెట్టి సూర్య ప్రకాష్, లక్ష్మీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత కె.నాని, ఉమా డయాగ్నొస్టిక్స్ అధినేత ఉమాశంకర్, పావని, యం.ఆర్.ఐ. టెక్నాలజిస్ట్ మేడిద కృష్ణ, హెల్పింగ్ ‌హేండ్స్ కొమ్ముల భార్గవ్ వంశీ, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ రాజశేఖర్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ డా.సత్యలక్ష్మి గణేష్ జూనియర్ కాలేజి ఫ్యాకల్టీ కృష్ణ చైతన్య, రాంగోపాల్, రవికిరణ్ మరియు గోపాలకృష్ణ పాల్గొన్నారు.