డాక్టర్ కందుల ఆధ్వర్యంలో కొత్తజంటలకు తాళిబొట్లు, కొత్త బట్టలు పంపిణీ

దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పన్నెండు కొత్తజంటలకు బంగారు తాళిబొట్లను, కొత్త బట్టలను అందజేశారు. అల్లిపురం నెరేళ్ల కోనేరు వద్ద తన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సేవే పరమావధిగా భావించి తాను నిరంతరాయంగా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులోను సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తన పరిధిలో సహాయం చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకత్వం ఆదేశాలతో ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల పరిష్కార సాధన కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎసి నెంబర్ కోన తాతారావు, పొలిటికల్ సెక్రటరీ బి.హరి ప్రసాద్, చల్ల గోవిందు 33 వ వార్డు కార్పొరేటర్ వసంత లక్ష్మి, పార్టీ నాయకులు పి.వి.ఎస్ ఎన్ రాజు, నార్త్ పార్టీ ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, స్టేట్ సెక్రటరీ అంగ ప్రశాంతి, పాడేరు ఇంచార్జ్ గంగులయ్య, తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, రఘు, త్రినాధ్, నరేష్, ప్రసాద్, ప్రణీత్, రవి , అంథోని, అనిల్, యజ్ఞశ్రీ , శ్రీను, రాజు, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.