బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు

రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి, ఎస్సి నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారికి బొంతు రాజోలు నియోజకవర్గం జనసేన-టీడీపీ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు కలిసి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాజేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ విధానాలతో రాష్ట్రంలోని అధిక శాతం మంది విసుగు చెందారన్నారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు అభినందిస్తూ వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుంది మీ అందరికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, మంగేనా నాగభూషణం, విపర్తి సాయిబాబు, సర్పంచ్ కాకర శ్రీనివాసరావు, గుడాల వెంకటేశ్వర, అడబాల సిరి, సోంపల్లి గ్రామాశాఖ అధ్యక్షులు మొల్లేటి నాగరాజు, నక్క రామారావు తదితరులు పాల్గొన్నారు.